ముఖ్యమంత్రికి రూ.25 లక్షల విరాళం చెక్కు అందించిన మోహన్ బాబు.

ముఖ్యమంత్రికి రూ.25 లక్షల విరాళం చెక్కు అందించిన మోహన్ బాబు.

గత నెలలో అకాల వర్షాకాలకి ఆంధ్ర ప్రదేశ్ లోని విజయవాడ అతలాకుతలం అయిన సంగతి తెలిసిందే. దీంతో వరద భాదితులను ఆదుకునేందుకు పలువురు ప్రముఖులు తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చి విరాళాలు ప్రకటించారు. ఈ క్రమంలో ప్రముఖ సినీ నటుడు మరియు నిర్మాత మంచు మోహన్ బాబు కూడా తనవంతుగా రూ.25 లక్షలు విరాళంగా ప్రకటించారు. 

దీంతో ఈరోజు (సెప్టెంబర్ 28) మంచు మోహన్ బాబు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబబు నాయుడుని కలిసి రూ.25 లక్షల విరాళం చెక్కుని అందించినట్లు మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలిపాడు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు కన్నప్ప చిత్రం గురించి చర్చించామని తెలిపాడు.

ALSO READ | 50 సెకన్ల యాడ్ కోసం రూ.5 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్న హీరోయిన్. 

ఇక తాను గీసిన చంద్రబాబు చిత్రపటం పై ఆటో గ్రాఫ్ తీసుకున్నట్లు మంచు విష్ణు ట్వీట్ లో పేర్కొన్నాడు. ఈ క్రమంలో చంద్రబాబు నాయుడుతో దిగిన ఫోటోలు కూడా షేర్ చేశాడు.  దీంతో మంచు అభిమానులు స్పందిస్తూ మంచు అన్న మంచి మనసు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం మంచు విష్ణు తెలుగులో కన్నప్ప అనే చిత్రంలో నటిస్తున్నాడు.  రూ.200 కోట్లతో ఈ  చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. కాగా ఆ మధ్య కన్నప్ప చిత్రంలో విష్ణు కి సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది.