
మలయాళ స్టార్ మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ ఎల్ 2 ఎంపురాన్ (L2 Empuraan). పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్గా వచ్చిన ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయింది. ఈ మూవీ డిజిటల్ రైట్స్ను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ భారీ ధరకు దక్కించుంది.
లేటెస్ట్గా ఎల్ 2 ఎంపురాన్ ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటిస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది. ఏప్రిల్ 24 నుంచి జియో హాట్స్టార్లో స్ట్రీమింగ్కు రానున్నట్లు సదరు ఓటీటీ సంస్థ ప్రకటించింది.
“అబ్రహం ప్రపంచం ఇక్కడ ప్రారంభం అవుతుంది. ఎల్2: ఎంపురాన్ ఏప్రిల్ 24 నుంచి కేవలం జియోహాట్స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది” అనే క్యాప్షన్ తో రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది. మలయాళంతోపాటు తెలుగు, తమిళం, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్కు అందుబాటులో ఉండనుంది.
L2: Empuraan will be streaming from 24 April only on JioHotstar.#L2E #Empuraan #JioHotstar pic.twitter.com/RY5mLWXhm3
— SreeGokulamMovies (@GokulamMovies) April 17, 2025
ఎల్ 2 ఎంపురాన్ మూవీ 2025 మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. పృథ్వీరాజ్ సుకుమారన్ డైరెక్ట్ చేయడంతో పాటు కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ మూవీ వరల్డ్ వైడ్గా రూ.250 కోట్లకి పైగా గ్రాస్ వసూళ్లు చేసి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్గా నిలిచింది.అంతేకాకుండా మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా చరిత్ర సృష్టించింది.
Malayalam cinema breaches the 250 cr barrier for the first time in its history!
— Aashirvad Cinemas (@aashirvadcine) April 6, 2025
The Emperor and his General navigating never seen before territory! #L2E #Empuraan @mohanlal @PrithviOfficial #MuraliGopy @antonypbvr @aashirvadcine @GokulamGopalan @GokulamMovies #VCPraveen… pic.twitter.com/NgRjccviSo
అయితే వసూళ్లతో పాటుగా వివాదాలు కూడా ఈ సినిమాను చుట్టుముట్టాయి. 2002 గుజరాత్ గోద్రా అల్లర్లకు సంబంధించిన సీన్స్, ఈ మూవీలో చూపించారని, పెద్ద ఎత్తున్న అల్లర్లు చెలరేగాయి. దాంతో 17 సీన్స్ ను కట్ చేయాల్సి వచ్చింది. అలాగే, మోహన్ లాల్ సైతం క్షమాపణలు చెప్పాల్సి వచ్చింది.
ఇకపోతే, ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో మోహన్లాల్, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, మంజు వారియర్, టోవినో థామస్, సచిన్ ఖేడ్కర్, అభిమన్యు సింగ్ తదితరులు నటించారు. దాదాపు రూ.150 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీని తమిళ చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఆశీర్వాద్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించాయి. తెలుగులో దిల్ రాజు ప్రొడ్యూస్ చేశాడు. మురళి గోపి కథను అందించారు.