Health Alert: వర్షాకాలంలో పప్పులకు దూరంగా ఉండండి.. ఎందుకంటే..

Health Alert: వర్షాకాలంలో పప్పులకు దూరంగా ఉండండి.. ఎందుకంటే..

చల్లటి తొలకరి చినుకులతో వాతావరణమంతా ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. ఇక ఎప్పుడు ముసురుపట్టి వర్షం పడుతుందో తెలియక ఇబ్బందులు పడుతుంటాం. ఓ పక్క వంటిట్లో వస్తువులు నిల్వ చేసుకోవడం కష్టమంటే, మరోవైపు వర్షాలకు బ్యాక్టీరియా, వైరస్‌లతో సీజనల్‌ ఫ్లూ జ్వరాలు ఊపందుకుంటాయి. ఇలాంటి వర్షాకాలంలో అందుకు తగ్గట్టు మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే పలు రకాల సమస్యల నుంచి బయటపడొచ్చు. ముఖ్యంగా పప్పుధాన్యాలు ఆరోగ్యానికి మంచిదని తినేస్తుంటాం. కానీ ఈ వర్షాకాలంలో ఇలాంటివి అస్సలు తీసుకోకూడదని హెచ్చరిస్తున్నారు నిపుణులు. కారణాలేంటో సవివరంగా చూద్దాం. 

పప్పుధాన్యాలు ఆరోగ్యకరమైనవే అయినా వర్షాకాలంలో మాత్రం ఇలాంటి పప్పులకు దూరంగానే ఉండాలి. ఎందకంటే వాతావరణంలోని తేమ శరీరంలోని జీర్ణవ్యవస్థపై ప్రభావం చూపుతుంది. గ్యాస్‌, ఉబ్బరం, ఆమ్లత్వం వంటి సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా బీన్స్‌, కాయధాన్యాలు, చిక్‌పీస్‌, బఠానీలు వంటి పప్పుధాన్యాలకు దూరంగా ఉండాలి. 

వర్షాకాలం వచ్చింది అంటే చాలు చాల రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుంది. అంటువ్యాధులు, వైరస్, ఇన్ఫెక్షన్లు వంటి అనేక రకాల సమస్యలు ఎదురవుతుంటాయి. అందువల్ల వర్షాకాలంలో తీసుకునే ఆహారంపై చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే సాధారణంగా మధ్యతరగతి ఇళ్లలో కూరగాయలను కొనుగోలు చేయడానికే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో అయితే కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతాయి. కూరగాయలను కొనుగోలు చేయలేక పప్పులతో గడిపేస్తుంటారు.

అయితే వర్షాకాలంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలనే ఆలోచన కాకుండా తమ కుటుంబ ఆర్థిక పరిస్థితి ఆలోచించి మెదులుతుంటారు. అయితే వర్షాకాలంలో సాధారణంగా కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. పప్పుల్లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల మేలు జరుగుతుంది. ముఖ్యంగా వీటిలో ఉండే మెగ్నీషియం, ఫాస్పరస్, జింక్, ఐరన్, ప్రొటిన్, ఫైబర్ వంటి అనేక రకాల మినరల్స్ శరీరానికి చాలా విధాలుగా తోడ్పడతాయి.

పప్పులు తినడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ వర్షాకాలంలో కొన్ని రకాల పప్పులు తీసుకోవడం వల్ల సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని రకాల పప్పులు తినడం వల్ల శరీరంలో చాలా రకాల సమస్యలు తలెత్తుతాయి. ఎందుకంటే వర్షాకాలంలో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. అందువ్లల గ్యాస్, కడుపులో మంట, మలబద్ధకం, కడుపు ఉబ్బరం వంటి చాలా కడుపు సంబంధింత సమస్యలు తలెత్తుతాయి. పప్పుల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. శరీరంలో ఫైబర్ ఎక్కువైనా కూడా సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల రాజ్మా, శెనగలు, పెసర్లు వంటి పప్పులకు దూరంగా ఉంటే మంచిది.

సెనగపప్పు: సెనగపప్పులో ప్రోటీన్‌, ఫైబర్‌, మినరల్స్‌ ఉంటాయి. ఇవి అజీర్ణం, అపానవాయువుకి దారితీస్తుంది. సెనగపప్పు బరువు నిర్వహణలో, కొలస్ట్రాల్‌ను నియంత్రించడం తోపాటు మొత్తం జీర్ణ ఆరోగ్యానికి తోడ్పడుతుంది. 

మసూర్‌ పప్పు లేదా ఎర్ర పప్పు: వీటిలో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం, మెగ్నీషియం, ఐరన్, విటమిన్లు సీ, బీలు ఉన్నాయి. అయినప్పటికీ దీనిలో ఉండే రాఫినోస్, స్టాకియోస్ వంటి చక్కెరలు జీర్ణం కావడం కష్టమవ్వడం వల్ల ఇది అపానవాయువుకు కారణమవుతుంది.

మినపప్పు: ఎముకల ఆరోగ్యానికి మద్దతునిస్తుంది, శక్తిని పెంచుతుంది. ఇది పొట్టపై భారంగా ఉంటుంది. జీర్ణంమవడం కష్టమవుతుంది. ఇది తేమతో కూడిన వాతావరణంలో అసౌకర్యం, ఉబ్బరానికి దారితీస్తుంది.
తినకూడని ఇతర ఆహారపదార్థాలు..

వేయించిన ఆహారాలు: వర్షాకాలంలో రోజూ వేయించిన ఆహారాన్ని తినకుండా ఉండటం చాలా అవసరం. ఇది జీర్ణక్రియను నెమ్మదిస్తుంది. ఫలితంగా ఆ ఒత్తిడి కాలేయంపై ఏర్పడుతుంది.