
అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)లో నూతనంగా ఏర్పాటు చేసిన మూన్ టూ మార్స్ ప్రాజెక్ట్ తొలి చీఫ్గా భారత సంతతికి చెందిన సాఫ్ట్వేర్, రోబోటిక్స్ ఇంజినీర్ అమిత్ క్షత్రియ నియమితులయ్యారు. మానవాళి ప్రయోజనాల కోసం చంద్రుడు, అంగారక గ్రహాలపై జీవరాశి అన్వేషణ కార్యకలాపాలను నిర్వహించడం కోసం ఈ ప్రాజెక్టును నాసా చేపట్టింది. చంద్రుడిపై సుదీర్ఘకాలం మకాం వేయడానికి, అక్కడి నుంచి అంగారక గ్రహంపైకి మనుషులను పంపాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు.
2003 నుంచి అమిత్ క్షత్రియ అంతరిక్ష కార్యకలాపాల్లో పనిచేస్తున్నారు. ఆయన తల్లిదండ్రులు భారత్ నుంచి అమెరికా వలస వెళ్లారు. అమిత్ క్షత్రియ విస్కాన్సిన్లోని బ్రూకఫీల్డ్లో పుట్టారు. సాఫ్ట్వేర్, రోబోటిక్స్ ఇంజినీర్గానే కాకుండా స్పేస్క్రాప్ట్ ఆపరేటర్గానూ నాసాలో సేవలందించారు. 2014 నుంచి 2017 వరకు స్పేస్ స్టేషన్ ఫ్లైట్ డైరెక్టర్ బాధ్యతలు నిర్వర్తించారు. అమిత క్షత్రియ సేవలకుగాను నాసా అవుట్ స్టాండింగ్ లీడర్షిప్ మెడల్, సిల్వర్ స్నూపీ అవార్డు పొందారు.