ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇసుక బుకింగ్

ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు ఇసుక బుకింగ్
  • టీజీఎండీసీ ఉత్తర్వులు

హైదరాబాద్, వెలుగు: ఇసుక బుకింగ్​ సమయాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఆన్​లైన్​లో ఇసుక బుకింగ్​ చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు టీజీఎండీసీ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. 

అదే సమయంలో ఇసుక రీచ్​ల నుంచి మూడు రెట్లు ఎక్కువగా ఇసుక తీయాలని ఆదేశించింది. స్టాక్​ యార్డ్​లలో టిప్పర్లు తప్ప వేరే ఇతర వాహనాలను అనుమతించకూడదని స్పష్టం చేసింది. ఎంట్రీకి, ఎగ్జిట్​కు ఒకే రూట్ ఉండాలని,  టిప్పర్​కు లోడింగ్​ బాడీ లెవెల్​ కంటే ఎక్కువగా ఉండకూడదని తెలిపింది. ఈ నిబంధనలను ఎవరైనా అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని, ఒప్పందాలను రద్దు చేస్తామని హెచ్చరించింది.