భారీ భూకంపం..296 మంది మృతి

భారీ భూకంపం..296 మంది మృతి

మొరాకోలో భారీ భూకంపం సంభవించింది. స్థానిక కాలమానం ప్రకారం సెప్టెంబర్ 08వ తేదీ శుక్రవారం  రాత్రి 11:11 నిమిషాలకు భూమి కంపించింది. రిక్టర్​ స్కేల్​పై భూకంపం తీవ్రత 6.8గా నమోదైంది. ఈ ఘటనలో 296  మంది మరణించారు. 153 మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

నైరుతి మర్రాకేశ్​ ప్రాంతంలో భూమికి 18.5 కిలో మీటర్ల దిగువన భూకంపం నమోదైంది. అట్లాస్ పర్వతాలలోని ప్రసిద్ధ స్కీ రిసార్ట్ అయిన ఔకైమెడెన్‌కు పశ్చిమాన 56.3 కిలోమీటర్లలో కేంద్రీకృతమైందని పేర్కొంది. పదుల సార్లు భూమి కంపించిందని అమెరికా జియోలాజికల్​ సర్వే  ప్రకటించింది. మొరాకోలో భూకంపం ధాటికి భవనాలు పేకమేడలను తలపించాయి. ఎక్కడికక్కడ కూలిపోయాయి. భూమి కంపించడంతో  ప్రజలు భయంతో ఇళ్లల్లో నుంచి బయటకు పరుగులు తీశారు.