భారత దేశంలోని సరస్సులు ఇవే

భారత దేశంలోని సరస్సులు ఇవే

సరస్సుల అధ్యయనాన్ని లిమ్నాలజీ అంటారు.

సాంబార్ సరస్సు : రాజస్థాన్​లో ఉంది. ఇది మనదేశంలోనే అతి పెద్ద భూపరివేష్టిత ఉప్పు నీటి సరస్సు.

చిల్కా సరస్సు : ఒరిస్సాలో ఉంది. ఇది మనదేశంలోనే అతి పొడవైన ఉప్పునీటి లాగూన్​ (సముద్ర తీరం) సరస్సు.

ఊలార్​ సరస్సు : జమ్ముకశ్మీర్​లో ఉంది. ఇది మనదేశంలోనే అతి పెద్ద మంచినీటి సరస్సు. ఇది జీనం నది వల్ల ఏర్పడింది.

గోవింద సాగర్ ​: హిమాచల్​ ప్రదేశ్​లో ఉంది. ఇది మనదేశంలో కృత్రిమంగా నిర్మించిన అతిపెద్ద మంచినీటి సరస్సు. ఇది సట్లెజ్​ నది వల్ల ఏర్పడింది. 

చోలాము సరస్సు : సిక్కింలో ఉంది. 2011, ఆగస్టులో ఈ సరస్సును సర్వే ఆఫ్​ ఇండియా గుర్తించింది. ఇది మన దేశంలో ఎత్తయిన సరస్సు.

లోనార్​ సరస్సు : మహారాష్ట్రలో ఉంది. ఇది మన దేశంలో ఏకైక గ్రేటర్​ సరస్సు (అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడింది)

పులికాట్​ సరస్సు : ఏపీ, తమిళనాడు సరిహద్దులో ఉంది. ఇది ఏపీలో పెద్ద ఉప్పునీటి సరస్సు. ఇది లాగూన్​ రకానికి చెందింది.
 

కొల్లేరు సరస్సు : ఏపీలో కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మధ్య ఏలూరుకు సమీపంలో ఉంది. ఇది ఆంధ్రప్రదేశ్​లో అతి పెద్ద మంచినీటి సరస్సు. ఇది ఆక్స్ బే రకానికి చెందింది. విస్తీర్ణం 250 చ.కి.మీ. కృష్ణా, గోదావరి మధ్య పల్లపు ప్రాంతంలో ఏర్పడింది.