
బషీర్బాగ్, వెలుగు: దేశ వ్యాప్తంగా సైబర్నేరాలకు పాల్పడుతున్న మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ మహమ్మద్ జుబైర్(31)ను హైదరాబాద్సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. సైబర్ క్రైమ్స్ డీసీపీ డి.కవిత వివరాల ప్రకారం.. గతేడాది 24న మనీలాండరింగ్ కేసులో డిజిటల్అరెస్ట్ పేరిట సిటీకి చెందిన వ్యక్తిని సైబర్నేరగాళ్లు మోసగించారు. అతని నుంచి రూ.55 లక్షలు కాజేశారు.
బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తులో ప్రధాన నిందితుడైన, దుబాయ్లో ఉండే మహమ్మద్ జుబైర్, మరో నలుగురిని పోలీసులు గుర్తించారు. జుబైర్పై లుక్ ఔట్ సర్క్యులర్ జారీ చేశారు. తాజాగా జుబైర్ దుబాయ్ నుంచి హైదరాబాద్ రాగా ఎయిర్ పోర్టులో అదుపులోకి తీసుకున్నారు. అతనిపై దేశవ్యాప్తంగా 124 కేసులు నమోదై ఉన్నాయి. తెలంగాణలో 23 కేసులు ఉన్నాయి.