రంగారెడ్డి జిల్లాలో ఘోరం.. తల్లీకూతురు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో  ఘోరం.. తల్లీకూతురు ఆత్మహత్య

రంగారెడ్డి జిల్లాలో  ఘోరం  జరిగింది.  నార్సింగ్​ పోలీస్​ స్టేషన్​ పరిధిలో తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మై హోమ్ అవతార్ అపార్ట్‌మెంట్  18 వ ఫ్లోర్​ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు.  దీంతో స్థానికులు, అపార్ట్​ మెంట్​ వాసులు భయాందోళనకు గురయ్యారు.  సమాచారం అందుకున్న నార్సింగ్​ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు ఆరా తీస్తున్నారు.  మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.  ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు విచారణలో వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు. 

ALSO READ | దేశ రాజధానిలో దారుణం.. నలుగురు కూతుర్లను చంపి తండ్రి ఆత్మహత్య