రంగారెడ్డి జిల్లాలో ఘోరం జరిగింది. నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో తల్లీకూతురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మై హోమ్ అవతార్ అపార్ట్మెంట్ 18 వ ఫ్లోర్ నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. దీంతో స్థానికులు, అపార్ట్ మెంట్ వాసులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతుల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఈ ఘటన గురించి ఇంకా పూర్తి వివరాలు విచారణలో వెల్లడవుతాయని పోలీసులు తెలిపారు.
ALSO READ | దేశ రాజధానిలో దారుణం.. నలుగురు కూతుర్లను చంపి తండ్రి ఆత్మహత్య