ఇంటర్ పరీక్షల్లో ఇన్స్పిరేషనల్ సీన్: అమ్మ ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడింది..

ఇంటర్ పరీక్షల్లో ఇన్స్పిరేషనల్ సీన్: అమ్మ ఆత్మవిశ్వాసం ముందు అంగవైకల్యం ఓడింది..

భీమదేవరపల్లి, వెలుగు: హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం రంగయ్యపల్లికి చెందిన గూళ్ల లక్ష్మీ, సమ్మయ్య దంపతుల కొడుకు రాకేశ్​  పుట్టుకతోనే వికలాంగుడు. కాగా, కండరాల క్షీణత వ్యాధి  పోరాడుతున్నాడు. కొడుకు అలా ఉన్నాడని కుమిలిపోకుండా  తల్లి  కొడుకును  చదువుకోవాలని ప్రోత్సహించింది. 

స్కూల్, కాలేజీ దాకా చెప్పించింది. బుధవారం ఇంటర్ ​పరీక్షలు ప్రారంభం కావడంతో ఫస్టియర్​ చదువుతున్న తన కొడుకును ముల్కనూర్​లోని సెంటర్​ వద్దకు ఎత్తుకుని వచ్చింది. తల్లి ఆత్మవిశ్వాసం ముందు కొడుకు అంగవైకల్యం ఓడిపోయిందని అక్కడకు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులు ముచ్చటించుకున్నారు.