అయ్యో.. ఎందుకమ్మా ఇలా చేశావ్: హైదరాబాద్ ప్రగతి నగర్ లో కూతురికి విషం ఇచ్చి.. తల్లి ఆత్మహత్య

అయ్యో.. ఎందుకమ్మా ఇలా చేశావ్: హైదరాబాద్ ప్రగతి నగర్ లో కూతురికి విషం ఇచ్చి.. తల్లి ఆత్మహత్య

హైదరాబాద్ లో ఇద్దరు కొడుకులను నరికి చంపి.. తల్లి ఆత్మహత్యకు పాల్పడ్డ హృదయ విదారక ఘటన మరవకముందే.. అలాంటిదే మరో ఘటన చోటు చేసుకుంది.. కూతురికి విషం ఇచ్చి ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. హైదరాబాద్ లోని ప్రగతి నగర్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. ఆదివారం ( ఏప్రిల్ 20 ) జరిగిన ఈ ఘటనకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.. 

బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్ లో నాలుగేళ్ళ కూతురికి విషం ఇచ్చి.. తానూ కూడా తీసుకొని ఆత్మహత్యకు పాల్పడింది ఓ తల్లి. ఈ ఘటనలో కూతురు మృతి చెందగా.. తల్లి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. కూకట్ పల్లిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో తల్లికి చికిత్స అందిస్తున్నారు.

ఆరోగ్య సమస్యలతోనే ఆత్మహత్యకు కారణమని తెలిపారు బాచుపల్లి పోలీసులు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

►ALSO READ | హైదరాబాద్ లో దారుణం: స్కూటీపై వెళ్తుండగా కత్తితో దాడి.. వ్యక్తి స్పాట్ డెడ్..