
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం చండి గ్రామంలోని జడ్పీ హైస్కూల్ఆవరణలో సోమవారం ఉదయం ఓ తల్లి కోతి చనిపోగా పిల్ల కోతి అరుపులకు వందల సంఖ్యలో కోతులు అక్కడికి వచ్చాయి. అవి కేకలు వేస్తూ దాడికి ప్రయత్నించడంతో స్కూల్కు వస్తున్న స్టూడెంట్స్భయంతో పరుగులు తీశారు. విషయం తెలిసి కొందరు పేరెంట్స్కోతులను తరిమేందుకు ప్రయత్నంచగా వారిపై కూడా దాడి చేయడానికి వచ్చాయి. సమాచారం తెలుసుకున్న ఎంఈవో బుచ్చా నాయక్ గ్రామస్తుల సహకారంతో కోతుల గుంపును వెళ్లగొట్టి చనిపోయిన కోతిని స్కూల్ఆవరణలో నుంచి తీసివేయించారు. - శివ్వంపేట, వెలుగు