
- సిటీలో కొనసాగుతున్న ‘మోటార్ ఫ్రీ ట్యాప్’ స్పెషల్ డ్రైవ్
- ఎక్కడ ఎవరు తనిఖీలు చేస్తున్నది కూడా చూడొచ్చు
- ఇప్పటివరకు నల్లాలకు మోటార్లు బిగించిన 892 మందిపై కేసులు
హైదరాబాద్సిటీ, వెలుగు: గ్రేటర్ పరిధిలో వాటర్బోర్డు చేపట్టిన ‘మోటార్ ఫ్రీ ట్యాప్’ స్పెషల్ డ్రైవ్విస్తృతంగా కొనసాగుతుండగా, దీన్ని బోర్డు ఎండీ అశోక్రెడ్డి హెడ్డాఫీసు నుంచి ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారు. ఉన్నతాధికారులు మొదలుకుని సెక్షన్ కార్యాలయాల స్థాయి అధికారులంతా ఈ డ్రైవ్లో పాల్గొంటున్నారు. ఎండీ కూడా కొద్ది రోజులు ఫీల్డ్విజిట్చేసి వినియోగదారులను కలిసి మాట్లాడి అవగాహన కల్పించారు.
సరఫరా టైంలో నల్లాలకు మోటార్లు బిగించి నీటిని తోడేయడం వల్ల ఇతరులకు సరఫరా తక్కువ అవుతోందని, లోప్రెషర్సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని, అందుకే ‘మోటార్ ఫ్రీ ట్యాప్’ డ్రైవ్ను ప్రవేశపెట్టామంటున్నారు. అధికారులు ప్రతి రోజూ అక్రమ మోటర్లను తనిఖీ నిర్వహిస్తూ దొరికిన వారికి జరిమానాలు విధిస్తుండగా, మరికొందరిపై కేసులు నమోదు చేస్తున్నారు. ఈ డ్రైవ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎండీ అశోక్రెడ్డి ఇతర పనులతో హెడ్డాఫీసులో బిజీగా ఉన్నా టైం తీసుకుని మరీ తన చాంబర్నుంచి పరిశీలిస్తున్నారు.
జీపీఎస్, కెమెరాల లింక్..
ఎండీ అశోక్రెడ్డి ఆఫీసు నుంచి ప్రతి రోజూ ఎక్కడ డ్రైవ్జరుగుతున్నా పర్యవేక్షిస్తున్నారు. దీని కోసం ఓ సిస్టమ్ను ఏర్పాటు చేసుకున్నారు. ఆయన చాంబర్లో ఎదురుగా ఉన్న భారీ డాష్బోర్డుపై సిబ్బంది ఎక్కడ తనిఖీలు చేస్తున్నా ప్రత్యక్ష్యంగా చూస్తున్నారు. దీని కోసం ఆర్క్జీఐఎస్సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్నారు. ఇది సిబ్బంది, అధికారుల మొబైల్యాప్కు కనెక్ట్అయి ఉంటుంది. ఎండీ ముందు ఉన్న స్క్రీన్పై జీపీఎస్ ద్వారా సిబ్బంది ఎక్కడెక్కడ ఉన్నారో తెలుసుకుని కావాల్సిన చోటును ఆయన పరిశీలిస్తున్నారు. ఆఫీసర్లు ఎక్కడికి తనిఖీలకు వెళ్లారు? వారు అక్కడ ఏం చేస్తున్నారు? మోటర్లు పెట్టినవారికి ఫైన్లు వేస్తున్నారా లేదా? అన్న విషయాలను ఆయన చూస్తున్నారు. అవసరమైతే అక్కడి అధికారులు, సిబ్బందికి ఫోన్ద్వారా సూచనలు ఇస్తున్నారు.
892 కేసులు నమోదు
స్పెషల్ డ్రైవ్ ప్రారంభించిన వారం రోజుల్లోనే ఇప్పటి వరకూ ఎక్కడెక్కడ ఎంత మందిపై కేసులు పెట్టారన్నది కూడా డాష్ బోర్డుపై కనిపిస్తుంది. దీనిపై డేటా ఎప్పటికప్పుడు అప్డేట్అవుతూ ఉంటుంది. ఇలా 21వ తారీఖు వరకు 892 మందిపై కేసులు నమోదు చేశారు. ఈ సందర్భంగా వాటర్బోర్డు ఎండీ మాట్లాడుతూ తనిఖీల ద్వారా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం తమ లక్ష్యం కాదని, వినియోగ దారుల్లో అవగాహన కల్పించాలన్నదే తమ ఉద్దేశమన్నారు. నల్లాలకు మోటార్లు బిగించడం వల్ల ఇతరులకు తక్కువ నీరు వస్తుందని, అందరూ బిల్లులను కడుతున్నావారేనని, కానీ కొందరే ఎక్కువ నీటిని పొందేందుకు మోటార్లను బిగించడం సమంజసం కాదని అన్నారు.