
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో తొలి మహిళా రెస్క్యూ మెంబర్గా అంబటి మౌనిక శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కొత్తగూడెం ఏరియా పీవీకే–5 యింక్లైన్ అండర్గ్రౌండ్మైన్లో గత నవంబర్ లో ట్రైనీగా చేరారు. గతంలో హిందుస్తాన్జింక్లిమిటెడ్సంస్థలో ఆమె రెస్క్యూ ట్రైనింగ్పొందారు. రామగుండంలోని రెస్క్యూ స్టేషన్లో రిఫ్రెషనర్ప్రాక్టీస్కు అటెండ్అయ్యారు.
రెస్క్యూ కిట్ ను అందజేసి యాక్టివ్రెస్క్యూ ట్రైన్డ్పర్సన్గా ఆమెను టీంలోకి రెస్క్యూ సూపరింటెండెంట్మాధవరావు ఆహ్వానించారు. కొత్తగూడెం ఏరియా పీవీకే–5 యింక్లైన్కు చెందిన మౌనిక తొలి మహిళా రెస్క్యూ టీం మెంబర్గా సెలెక్ట్ కావడం పట్ల సీఎండీ ఎన్బలరాం, డైరెక్టర్లు డి. సత్యనారాయణ, సూర్యనారాయణ, వెంకటేశ్వరరావు, సేఫ్టీ జీఎం చింతల శ్రీనివాస్, జీఎం పర్సనల్కవితా నాయుడు, ఏరియా జీఎం షాలెం రాజు, ఎస్వోటూ జీఎం కోటిరెడ్డి, మైన్మేనేజర్శ్యాంప్రసాద్ హర్షం వ్యక్తం చేశారు.