మూసీ ప్రాజెక్ట్ నిర్వాసితులు పునరావాస కేంద్రాలకు తరలింపు

మూసీ ప్రాజెక్ట్ నిర్వాసితులు పునరావాస కేంద్రాలకు తరలింపు

మూసీ ప్రక్షాళనలో భాగంగా నిర్వాసితులను శుక్రవారం పునరావాస కేంద్రాలకు తరలించారు. వారిని సైదాపూర్ మండలంలోని పిల్లిగుడిసెలు ప్రాంతంలోని డబుల్ బెడ్ రూమ్ సముదాయాల్లోకి తరలించారు. హిమాయత్ నగర్ మండలం శంకర్ నగర్ లోని 6 కుటుంబాలు, వినాయక వీధిలోని 3 కుటుంబాలను వారి ఇంటి సామాన్లతో సహా డబుల్ బెడ్ రూమ్ భవన సముదాయంలోకి షిఫ్ట్ చేశారు. నాంపల్లిలోని 11 కుటుంబాలను అసిఫ్ నగర్ జియాగూడ కు తరలించారు. సెప్టెంబర్ 27న మొత్తం 20 ఫ్యామిలీలను పునరావాస కేంద్రాల్లోకి తరలించినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్అనుదీప్ దురిశెట్టి తెలిపారు.

ALSO READ | హైడ్రా పేరుతో హైడ్రామా.. ఎంపీ డీకే అరుణ హాట్ కామెంట్స్