హైదరాబాద్, వెలుగు: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని బంజారాహిల్స్ లోని ఆయన నివాసంలో బీజేపీ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ నెల 7న దివంగత నేత డి. శ్రీనివాస్ శ్రద్ధాంజలి సభకు సీఎంను ఆయన ఆహ్వానించారు.
కాగా..డీఎస్ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఇటీవల ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ రాసిన లేఖలపై అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. క్లిష్ట సమయంలో తమ కుటుంబం పట్ల సానుభూతి తెలిపినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాని ప్రధానినికి, రాహుల్ కి ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు.