
- కాంగ్రెస్ క్యాడర్ కు సూచించిన మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్
డోర్నకల్, (గార్ల), వెలుగు: రాష్ట్ర ప్రభుత్వంపై ప్రతి పక్షాల అసత్య ప్రచారాలను పార్టీ కార్యకర్తలు తిప్పి కొట్టాలని మహబూబాబాద్ఎంపీ పోరికబలరాం నాయక్ సూచించారు. మంగళవారం గార్ల మండల కేంద్రంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక బీజేపీ, బీఆర్ఎస్ నేతలు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని విమర్శించారు.
రైతులకు రూ. 2 లక్షల రుణమాఫీ, మహిళలకు ఫ్రీ బస్సు, సన్న వడ్లకు రూ.500 బోనస్, ఉచిత కరెంటు , రూ. 500 సబ్సిడీ గ్యాస్, హాస్టల్ విద్యార్థులకు అత్యున్నత స్థాయి సౌకర్యాలు , ఏడాదిలోనే 50వేలకుపైగా జాబ్ లు ఇచ్చినట్టు పేర్కొన్నారు. గార్ల మండల అఖిల పక్షం కమిటీ దరఖాస్తులను పరిశీలించి గార్లలో మణుగూరు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ నిలిపేందుకు సంబంధిత అధికారులతో మాట్లాడతానని తెలిపారు.
ఆయన వెంట పార్టీ నేతలు రావూరి వెంకటరామయ్య, సూర్యపురెడ్డి వెంకటరెడ్డి , గుండా వెంకట్ రెడ్డి, మాలోత్ వెంకట్ లాల్, ధనియాకుల రామారావు తదితరులు ఉన్నారు.