కేటీఆర్ నీ అయ్యనడుగు.. బండి సంజయ్ ఎవడో చెబుతాడు

కేటీఆర్ నీ అయ్యనడుగు.. బండి సంజయ్ ఎవడో చెబుతాడు

నాగార్జునసాగర్ ఉపఎన్నిక ప్రచారం ముగింపుకొచ్చింది. గురువారంతో అక్కడ ప్రచారానికి పుల్‌స్టాప్ పడనుంది. దాంతో అన్నీ పార్టీల నేతలు అక్కడ జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. చివరి రోజు కావడంతో బీజేపీ నేతలు బండి సంజయ్, విజయశాంతి, వివేక్ వెంకటస్వామి నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. ఆ సందర్భంగా బండి సంజయ్ అక్కడ మాట్లాడారు. రబ్బర్ చెప్పులు, జీన్ పాయింట్లు వేసుకున్న యువత దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికలలో సత్తా చూపారని.. సాగర్‌లో కూడా సత్తా చూపాలని సంజయ్ కోరారు. 

‘కేంద్ర నిధులతోనే గ్రామాల్లో అభివృద్ధి జరుగుతోంది. కేంద్రం ఇచ్చిన డబ్బులతో సాగర్‌లో అభివృద్ధి చేయకుండా.. సీఎం పెగ్గు వేస్తుండు. కేంద్రం తెలంగాణకు ఎన్ని కోట్లు ఇచ్చిందో లెక్కలతో చెబుతా. కేంద్ర నిధులతో మరుగుదొడ్లను నిర్మిస్తే.. వాటిపై గద్ద ముక్కు కేసీఆర్ బొమ్మలు పెట్టుకుంటుండు. కేటీఆర్ తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఎక్కడ ఉన్నావ్? నీ అయ్యను అడుగు బీజేపీ బండి సంజయ్ ఎవడో చెబుతాడు. సుష్మా స్వరాజ్ తెలంగాణ కోసం పార్లమెంట్‌లో మద్దతిచ్చింది గుర్తు లేదా? ఇద్దరు ఎంపీలున్న టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ తెచ్చిందా? 17న సాగర్ ప్రజలు టీఆర్ఎస్‌ను దెబ్బకొట్టాలి. కేసీఆర్ అవినీతి బాగోతం బయట పెట్టి జైలుకు పంపిస్తాం. బీజేపీ బడుగు బలహీన వర్గాల పార్టీ. రవి కుమార్ నాయక్ పేదోళ్ల బిడ్డ. సాగర్‌లో పేదోళ్లకు పెద్దోళ్ళకు జరుగుతున్న పోరు ఇది. ప్రజలు ఎటు ఉంటారో ఆలోచించుకోవాలి. సాగర్‌లో మందు ఏరులై పారుతుంది. టీఆర్ఎస్ నాయకులు సాగర్‌లో మందు విచ్చలవిడిగా పంచుతున్నారు. రవి నాయక్‌ను గెలిపించిన తర్వాత హాలియాలో విజయోత్సవ సభ పెడతాం’ అని సంజయ్ అన్నారు.