దళితులను మోసం చేయడమే మీ విధానమా: ఎంపి చామల

దళితులను మోసం చేయడమే మీ విధానమా: ఎంపి చామల
  • కేసీఆర్​ దీక్ష చేస్తాననటం విడ్డూరం
  • జగదీశ్​ రెడ్డి సస్పెన్షన్​ పై ఎంపి చామల

హైదరాబాద్​: సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్​ రెడ్డి సస్పెన్షన్​ పై ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేస్తామనటం విడ్డూరంగా ఉందని భువనగిరి ఎంపీ చామల కిరణ్​ కుమార్​ రెడ్డి అన్నారు. దళితులపై, దళిత నాయకులపై మీకున్న ఆలోచన విధానం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. ఉద్యమ సమయం నుంచే కేసీఆర్​ దళితులను మోసం చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎన్నోసార్లు దళితులను అవమానించారన్నారు. 

నాడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాజయ్యను బర్తరఫ్​ చేశారని, అందుకు ఎలాంటి కారణాలు చెప్పదేలన్నారు. ప్రణబ్​ ముఖర్జీ హైదరాబాద్​ వస్తే ఆయన కాళ్లు మొక్కారని, కోవింద్​ వస్తే మాత్రం కనీసం పట్టించుకోలేదని విమర్శించారు. దళితులను మోసం చేయడమే ఆ పార్టీ విధానంగా ఉందన్నారు.