వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద పరిహారం ఇవ్వాలి : ఎంపీ డీకే అరుణ

వన్ టైమ్ సెటిల్ మెంట్ కింద పరిహారం ఇవ్వాలి : ఎంపీ డీకే అరుణ
  • ఉదండాపూర్ రిజర్వాయర్ 
  • భూ నిర్వాసితుల ఆందోళనకు మద్దతు

జడ్చర్ల టౌన్, వెలుగు: మహబూబ్​నగర్​ జిల్లాలోని ఉదండాపూర్​ రిజర్వాయర్​లో భూములు కోల్పోయే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం పరిహారం ఇచ్చిన తర్వాతే ప్రాజెక్టు పనులు చేపట్టాలని ఎంపీ డీకే అరుణ డిమాండ్​ చేశారు. పరిహారం కోసం జడ్చర్ల మండలం ఉదండాపూర్​లో నిర్వాసితులు ఆందోళన చేస్తుండగా ఆదివారం శిబిరాన్ని ఎంపీ సందర్శించి.. రైతుల ఆందోళనకు మద్దతు తెలిపారు. బాధిత రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 

ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ఉదండాపూర్  రైతుల డిమాండ్లు న్యాయమైనవని, నిర్వాసితులకు పరిహారం వన్  టైం సెటిల్​మెంట్​చేశాకే పనులు ప్రారంభించాలని స్పష్టంచేశారు. పదేండ్ల నాటి లెక్కల ప్రకారమే ఇస్తామంటే ఊరుకునేది లేదన్నారు. పార్టీల వారీగా పరిహారం ఇస్తామనడం సరికాదని, ఇదెక్కడి న్యాయమని ఆమె ప్రశ్నించారు. ఎమ్మెల్యే అనిరుధ్​రెడ్డికి చొరవ తీసుకొని సీఎం వద్దకు రైతులను తీసుకెళ్లి న్యాయం చేయాలని ఎంపీ సూచించారు.