![ఢిల్లీలో ఆటమ్ బైక్స్ ఔట్లెట్ ప్రారంభించిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ](https://static.v6velugu.com/uploads/2025/02/mp-gaddam-vamsi-krishna-who-started-atom-bikes-outlet-in-delhi_B9tKw3jbTz.jpg)
- అందుబాటులోకి 3 ఈవీ మోడల్స్
- రూ.40 వేల వరకు డిస్కౌంట్లు
న్యూఢిల్లీ, వెలుగు: సరికొత్త డిజైన్, సరికొత్త ఫీచర్స్ తో ఎలక్ట్రిక్ బైకులు తయారు చేసే ‘ఆటమ్ మొబైల్’ ఢిల్లీ ద్వారక సెక్టార్ 5 లోని రాజాపురిలో తన మొదటి ఔట్ లెట్ను అందుబాటులోకి తెచ్చింది. బుధవారం దీనిని ఆటమ్ మొబైల్ సంస్థ జేఎండీ, ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎలక్ట్రిక్ బైక్స్ అమ్మకాల్లో ఆటమ్ మొబైల్స్ను అగ్రగామిగా నిలపాలని, ఇతర కంపెనీలతో పోటీ పడి ఉన్నత శిఖరాలకు చేర్చాలని ఉద్యోగులకు సూచించారు. ప్రజల్లోకి వెళ్లాల్సిన విధానం గురించి వివరించారు. ఫస్ట్ ఔట్ లెట్ లాంచ్ సందర్భంగా కంపెనీ మూడు ఎలక్ర్టిక్ బైక్ మోడల్స్పై దాదాపు రూ. 25 వేల నుంచి రూ. 40 వేల వరకు డిస్కౌంట్లను ప్రకటించింది.
ఆటమ్ వేడర్–ఎస్ మామూలు ధర రూ. 1,08,500 కాగా... దాదాపు రూ. 25 వేల డిస్కౌంట్ ఆఫర్ లో రూ. 84, 999 కు అందిస్తోంది. వేడర్– ఈ, ఎక్స్ డిజైన్ల ధర రూ. 1, 38,000 కాగా, కేవలం రూ. 99,999 కు అమ్మతోంది. వీటిని ఒకసారి ఛార్జ్ చేస్తే... 100 కిలోమీటర్లు వెళ్తాయి. డిజైన్, చార్జింగ్, సీటింగ్, డ్రైవింగ్, మన్నికలో ఇవి ప్రత్యేకమని కంపెనీ పాన్ ఇండియా సేల్స్ హెడ్ అజిత్ సాబ్డే తెలిపారు. కేవలం మూడున్నర గంటల్లో చార్జ్ చేయవచ్చని , గంటకు 65 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయని చెప్పారు. ఏరియా మేనేజర్ కునాల్ భరద్వాజ్ మాట్లాడుతూ ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న డిజైన్ల కన్నా ఈ బైక్ మోడల్స్ చాలా ఆకర్షణీయంగా ఉంటాయని వివరించారు.