మందమర్రిలో ఎంపీ వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకం

మందమర్రిలో ఎంపీ వంశీకృష్ణ ఫొటోకు క్షీరాభిషేకం
  • కాజీపేట-బల్లార్షాఎక్స్​ప్రెస్​ రైలు పునరుద్ధరణ, మందమర్రిలో హాల్టింగ్​కు కృషి పట్ల కృతజ్ఞతలు

కోల్ బెల్ట్, వెలుగు: కాజీపేట–-బల్లార్షా ఎక్స్​ప్రెస్​ రైలు పునరుద్ధరణకు, మందమర్రి రైల్వే స్టేషన్​లో హాల్టింగ్​ కల్పించేందుకు కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటోకు గురువారం మందమర్రి మార్కెట్​లో  యూత్​ కాంగ్రెస్​ శ్రేణులు క్షీరాభిషేకం చేశారు.

యూత్​కాంగ్రెస్ ​లీడర్​ రాయబారపు కిరణ్ మాట్లాడుతూ నాలుగేండ్లు క్రితం కరోనా సమయంలో కాజీపేట–బల్లార్షా ఎక్స్​ప్రెస్ రైలు రద్దయ్యిందని.. రైలు సౌకర్యం లేక ప్రజలు, కార్మికులు, ఉద్యోగులు, విద్యార్థులు ఇబ్బందులు పడుతుండడంతో విషయాన్ని ఎంపీ వంశీకృష్ణ, ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామి కేంద్ర మంత్రుల దృష్టికి తీసుకవెళ్లి రైలు పునరుద్ధరణకు కృషి చేశారన్నారు.

రైలు పునరుద్ధరణతో పాటు మందమర్రి రైల్వేస్టేషన్​లో రైలుకు హాల్టింగ్ కల్పించిన ఎంపీ, ఎమ్మెల్యేకు లీడర్లు, కార్యకర్తలు కృతజ్ఞతలు తెలిపారు. లీడర్లు బియ్యపు రవి కిరణ్, సురేందర్, లక్ష్మణ్, ధనుక్ రాజేశ్, గణేశ్, మహేశ్, జీవన్ తదితరులు పాల్గొన్నారు.