కిషన్​రెడ్డికి సిగ్గుండాలి అంటూ ఫైర్ అయిన ఎంపీ మల్లు రవి

కిషన్​రెడ్డికి సిగ్గుండాలి అంటూ ఫైర్ అయిన ఎంపీ మల్లు రవి

హైదరాబాద్: ప్రజాపాలన దినోత్సవం వేడుకలకు రావాలని లేఖ రాస్తే  సిగ్గులేకుండా కిషన్ రెడ్డి రాలేమంటున్నారని ఎంపీ మల్లు రవి మండిపడ్డారు. అసలు స్వాతంత్ర్య పోరాటంలో బీజేపీ పాల్గొనలేదని.. ఎందుకంటే ఆ పార్టీ అప్పుడు పుట్టలేదన్నారు. గాంధీ భవన్‌లో మల్లు రవి మీడియాతో మాట్లాడుతూ ‘హైదరాబాద్ స్టేట్‌ను దేశంలో విలీనం చేసిన రోజు.. సెప్టెంబర్ 17, 1948.. రాజుల పాలన పోయి ప్రజా పరిపాలన మొదలైంది. 

అందుకే సీఎం రేవంత్ రెడ్డి సెప్టెంబర్ 17న‌ ప్రజా పాలన దినోత్సవం జరపాలని చూస్తున్నారు. వేడుకలకు హాజరుకావాలని సీఎం రేవంత్ కేంద్ర మంత్రులు అమిత్ షా, కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, గజేంద్ర షెకావత్ లకు లేఖ రాశారు. అయితే.. సిగ్గు లేకుండా కిషన్ రెడ్డి రాలేమంటున్నారు. ప్రజా పాలన దినోత్సవంలో పాల్గొనడానికి ఎందుకు రారు? 10 ఏండ్లు బీఆర్ఎస్ కూడా సెప్టెంబర్ 17ను గుర్తించలేదు.

రేవంత్ సీఎంగా ప్రమాణస్వీకారం చేయగానే ప్రగతి భవన్ కంచెను తొలగించారు.. ప్రజాపాలనకై చేశామ‌ని చెప్పారు. సీఎం స్వయంగా లేఖలు రాసి పంపినా రాలేను అని చెప్పడం సరైంది కాదు’ అని అన్నారు.