రేవంత్, కేసీఆర్ ఆలోచన విధానం ఒక్కటే: ఎంపీ రఘునందన్ రావు

రేవంత్, కేసీఆర్ ఆలోచన విధానం ఒక్కటే: ఎంపీ రఘునందన్ రావు

బడ్జెట్ కేటాయింపులపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఫైరయ్యారు ఎంపీ రఘునందన్ రావు. అన్ని రాష్ట్రాలకు సమానంగా కేటాయింపులు జరిగాయన్నారు. కేసీఆర్, రేవంత్ రెడ్డి ఆలోచన విధానం ఒక్కటేనన్నారు. జెండాలు మాత్రమే మారాయని...విధానాలు మారలేదని విమర్శించారు. మార్పు అంటే బీఆర్ఎస్ మ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావడమేనన్నారు. తెలంగాణకు కేంద్రం ఎన్ని నిధులు వచ్చాయో లెక్కలు ఉన్నాయని చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి మోదీ కట్టుబడి ఉందన్నారు ఎంపీ రఘునందన్ రావు.

 బీజేపీ ప్రభుత్వం పేదల కోసం పనిచేస్తుందన్నారు.  పార్లమెంట్ ఎన్నికల్లో గాడిద గుడ్డు వచ్చినోళ్లు కూడా ఢిల్లీలో దీక్ష చేస్తారా? అని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని హితవు పలికారు. హవాకులు చెవాకులు పేలొద్దన్నారు. బీజేపీ నాయకత్వమే దేశానికి,రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని అన్నారు. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా..బీజేపీని ఆశీర్వదించాలని కోరారు.