పోస్టాఫీస్​ సేవలను వినియోగించుకోవాలి : ఎంపీ రఘునందన్​రావు

పోస్టాఫీస్​ సేవలను వినియోగించుకోవాలి : ఎంపీ రఘునందన్​రావు

రామచంద్రాపురం, వెలుగు: పోస్ట్ ఆఫీస్​సేవలను ప్రతి పౌరుడు వినియోగించుకోవాలని ఎంపీ రఘునందన్​రావు సూచించారు. శనివారం తెల్లాపూర్​ మున్సిపల్​ పరిధిలోని అంబేద్కర్​ కాలనీలో పోస్ట్​ఆఫీస్​ను ప్రారంభించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారంలో భాగంగా తెల్లాపూర్​లోని విద్యావంతులు, సాఫ్ట్​వేర్​ ఎంప్లాయీస్​ పోస్ట్​ఆఫీస్​ కావాలని కోరారన్నారు. అందుకే తెల్లాపూర్​లో బ్రాంచ్​ ఏర్పాటు కోసం అధికారులతో మాట్లాడానని పేర్కొన్నారు.

తెల్లాపూర్​ వంద ఫీట్ల రోడ్ నుంచి ఎంఐజీ వైపు బ్రిడ్జి ఏర్పాటును త్వరలోనే పూర్తి చేస్తామని, రైల్వే అండర్​ పాస్​ విస్తరణ తొందర్లోనే పూర్తవుతుందన్నారు. తెల్లాపూర్​ పేరును తెలంగాణపురంగా మార్చడానికి అధికారులు ప్రతిపాదనలు తయారు చేసి ఉన్నతాధికారులకు పంపాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా పోస్టల్​అధికారి మురళీ కుమార్, మున్సిపల్​ కమిషనర్​ సంగారెడ్డి, బీజేపీ మున్సిపల్​అధ్యక్షుడు రాంబాబు, మాజీ కౌన్సిలర్​ శంషాబాద్​రాజు, పీఏసీఎస్​చైర్మన్​బుచ్చిరెడ్డి పాల్గొన్నారు.