ఆ విషయంలో అసదుద్దీన్ ఓవైసీని మెచ్చుకోవచ్చు: రఘునందన్ రావు

ఆ విషయంలో  అసదుద్దీన్ ఓవైసీని మెచ్చుకోవచ్చు: రఘునందన్ రావు

హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్  ఓవైసీని మెచ్చుకోవాలన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. గతంలో కేసీఆర్ ను గ్రిప్ లో పెట్టుకున్నారు..ఇపుడు కాంగ్రెస్  పార్టీ తన  స్టీరింగ్ ను  ఆయన చేతిలోనే పెట్టిందన్నారు.  ప్రధాని మోదీ జన్మదిన సందర్భంగా  సిద్దిపేట పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్త దానం శిబిరంను ప్రారంభించారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఈ సందర్బంగా మాట్లాడిన ఆయన.. ప్రజా పాలన దినోత్సవం చేయడం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు.  ఇప్పుడు రేవంత్ రెడ్డి పాలన దినోత్సవం జరుపుకుంటే మంచిగ ఉండేదని సెటైర్లు వేశారు.. ఇపుడైనా   హైదరాబాద్ విమోచన దినంగా ప్రకటించాలన్నారు రఘునందన్ రావు .

Also Read:-జర్నలిస్టులందరికి త్వరలో ఇళ్ళ స్థలాలు

 తెలంగాణ కోసం పోరాటం చేసినా అని గొప్పలు చెప్పుకునే హరీష్ ఎందుకు విమోచన దినం శుభాకాంక్షలు చెప్పడం లేదన్నారు రఘునందన్ రావు.. రాజీవ్ గాంధీ విగ్రహం ఎందుకు పెట్టారని  అడిగిన  బీఆర్ఎస్ నేతలు ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టలేదని ప్రశ్నించారు.  10 ఏళ్లు అధికారం ఉండి విమోచన దినం ఎందుకు జరపలేదని ప్రశ్నించారు రకేటీఆర్. రోశయ్య ముఖ్యమంత్రి ఉండగా. మేము అధికారం లోకి రాగానే చేస్తాం అని చెప్పి ఎందుకు జండా ఎగరవేయలేదు.  ఈ రాష్ట్రంలో అధికారంలోకి బీజేపీ రాగానే అధికారికంగా విమోచన దినం ఘనంగా జరుపుతామని చెప్పారు రఘునందన్ రావు.