కేంద్రీయ విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీ

కేంద్రీయ విద్యాలయాన్ని తనిఖీ చేసిన ఎంపీ

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం రూరల్ మండలంలోని కేంద్రీయ విద్యాలయాన్ని, ఖమ్మం సిటీలోని ఎన్ఎస్పీ క్యాంపులో ఉన్న అంబేద్కర్ కాలేజ్, గిరిజన సంక్షేమ శాఖ బాలికల వసతి గృహాలను సోమవారం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రీయ విద్యాలయంలో విద్యార్థులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు. అక్కడి ప్రాంగణంలో మొక్కలు నాటారు. బోధన, బోధనేతర సిబ్బందితో కలిసి సమావేశమై పలు అంశాలు చర్చించారు.

బోధనలో రాజీ పడకుండా స్టూడెంట్స్ ను తీర్చిదిద్దాలని సూచించారు. ఎంపీ వెంట కాంగ్రెస్ నాయకులు తుమ్మల యుగేందర్, ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు కళ్లెం వెంకటరెడ్డి, కొప్పుల చంద్రశేఖర రావు, కూర్మా రావు, తిప్పి రెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏనుగు మహేశ్, కాకి శ్రీను, నగేశ్​ ఉన్నారు.