రాష్ట్రంలో మళ్లీ జెండా ఎగురవేస్తాం

రాష్ట్రంలో మళ్లీ  జెండా ఎగురవేస్తాం

శంకర్​పల్లి, వెలుగు : రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమం బీఆర్ఎస్​ ప్రభుత్వంతోనే  సాధ్యమని చేవెళ్ల ఎంపీ రంజిత్​రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం శంకర్​పల్లి మున్సిపాలిటీలో రూ. 45లక్షలతో నిర్మించిన  చిల్ర్డన్స్ పార్క్ ని స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, మున్సిపల్​చైర్​పర్సన్​విజయలక్ష్మితో కలిసి ప్రారంభించారు. అనంతరం పార్క్ లో ఓపెన్​ జిమ్, పిల్లల ఆట వస్తువులను పరిశీలించి, పార్క్ ఆవరణలో మొక్క నాటారు. 

ఎంపీ మాట్లాడుతూ.. దేశంలోని అన్నిరాష్ట్రాలకు తెలంగాణ ఆదర్శంగా నిలుస్తుందని, రాష్ట్రంలో మళ్లీ బీఆర్ఎస్​ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని, వీలైనంత త్వరగా పరిష్కారమయ్యేలా చూస్తానని చెప్పారు.  కార్యక్రమంలో వైస్​ చైర్మన్​ వెంకట్​రాంరెడ్డి, పీఏసీఎస్​ చైర్మన్​శశిధర్​రెడ్డి, కౌన్సిలర్లుపాల్గొన్నారు.