
ఖమ్మం, వెలుగు : పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఎంపీలకు రాష్ట్రపతి భవన్ లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తేనీటి విందు ఇచ్చారు. శుక్రవారం ఉదయం జరిగిన ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర హాజరయ్యారు. సహచర ఎంపీలు సురేశ్ రెడ్డి, దామోదర్ రావుతో కలిసి రాష్ట్రపతి భవన్ లో అల్పాహారం తీసుకున్నారు.
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్న సందర్భంగా ఆనవాయితీ ప్రకారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభల సభ్యులను ఆహ్వానించి అల్పాహార విందునిచ్చారు.