పెద్దపల్లిలో వందేభారత్ రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలి.. రైల్వేజీఎంకు ఎంపీ వంశీకృష్ణ రిక్వెస్ట్..

పెద్దపల్లిలో వందేభారత్ రైలుకు స్టాప్ ఏర్పాటు చేయాలి.. రైల్వేజీఎంకు ఎంపీ వంశీకృష్ణ రిక్వెస్ట్..

పెద్దపల్లి నియోజకవర్గంలో రైల్వే అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి పెట్టాలని రైల్వే జీఎం ను కోరారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ. మంగళవారం ( అక్టోబర్ 8, 2024 ) హైదరాబాద్ లో రైల్వే జీఎంను కలిసిన ఎమ్మెల్యే వివేక్, ఎంపీ వంశీకృష్ణలు పలు ప్రతిపాదనలు ఆయన ముందు ఉంచారు. జీఎంతో భేటీ అనంతరం ఎంపీ వంశీకృష్ణ మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి ప్రాంతానికి కొత్త రైల్వే స్టేషన్స్, రైల్వే స్టేషన్ల రినోవేషన్, కరోనా టైంలో ఆపేసిన రైల్వే స్టాప్స్ తిరిగి  ప్రారంభించాలని జీఎంను కోరామని తెలిపారు. 

కేరళ ఎక్స్ ప్రెస్ కు మంచిర్యాలలో స్టాప్ ఏర్పాటు చేయాలని, వందే భారత్ ట్రైన్ కు కూడా రామగిరి ఎక్స్ప్రెస్ మందమర్రిలో స్టాప్ ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు వంశీకృష్ణ. ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీ బాగుంటేనే అన్ని ప్రాంతాలు డెవలప్ అవుతాయని అన్నారు. పెద్దపల్లి ప్రాంతం గత పదేళ్లుగా నిర్లక్ష్యానికి గురైందని.. పెద్దపల్లి ప్రాంతంపై ప్రత్యేక శ్రద్ధతో కొత్త రైల్వే స్టాప్స్ ,  ట్రాక్స్ ఏర్పాటు చేస్తే వ్యాపారం పరంగా కూడా డెవలప్ అవుతుందని అన్నారు. ప్యాసింజర్ కనెక్టివిటీ పెరుగుతే, బిజినెస్ కూడా పెరుగుతుందని అన్నారు.

పెద్దపల్లిలోని అన్ని నియోజకవర్గాలకు రైల్వే కనెక్టివిటీని ఉండేలా చేయాలనీ జీఎంని రిక్వెస్ట్ చేశామని.. తమ ప్రతిపాదనలకు రైల్వే జీఎం కూడా పాజిటివ్ గా రెస్పాండ్ అయ్యారని.. కొత్త స్టాప్స్ ఏర్పాటు చేసేందుకు సహకరిస్తానని అన్నట్లు తెలిపారు ఎంపీ వంశీకృష్ణ.

  • Beta
Beta feature