
కోల్ బెల్ట్, వెలుగు: పత్తి కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేకుండా సీసీఐ ఆఫీసర్లు తగిన చర్యలు తీసుకుంటున్నారని పెద్లపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. శుక్రవారం రాత్రి మంచిర్యాల జిల్లా చెన్నూరు పత్తి కొనుగోలు కేంద్రాన్ని ఎంపీ వంశీకృష్ణ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడి పత్తి కొనుగోలు తీరును అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఆధార్సర్వర్పని చేయకపోవడంతో పది రోజులుగా సీసీఐ సెంటర్లలో పత్తి కొనుగోళ్లు నిలిచిపోవడంతో ఇబ్బందులు పడ్డామని, ఎంపీ వంశీకృష్ణ చొరవతో తమ కష్టాలు తీరిపోయాయని పేర్కొన్నారు. సీసీఐ ఆఫీసర్లతో మాట్లాడి సమస్య పరిష్కారం కోసం కృషి చేసిన ఎంపీకి ఈ సందర్భంగా రైతులు కృతజ్ఞతలు తెలిపారు.
ఎంపీని కలిసిన ఆటో డ్రైవర్లు
నస్పూర్ మండలం కృష్ణకాలనీ ఆటో యూనియన్ బాధ్యులు, డ్రైవర్లు శుక్రవారం మంచిర్యాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణను కలిశారు. ఆటో కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఎంపీకి వినతిపత్రం అందజేశారు. ఎంపీని కలిసిన వారిలో ఐఎన్టీయూసీ లీడర్ మారుతీ, ఆటో యూనియన్ ప్రెసిడెంట్రాగిడి రాజు, ఉపాధ్యక్షులు ఎనగందుల వెంకటేశ్, గుడికాందుల శివ, కోశాధికారి బొబ్బల కుమార్, ప్రధాన కార్యదర్శి ఎండీ రహీం, ప్రచార కార్యదర్శి చిలుముల క్రాంతి, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.