తెలంగాణ బొగ్గు గనుల్ని సింగరేణికి కేటాయించండి : ఎంపీ వంశీకృష్ణ

తెలంగాణ బొగ్గు గనుల్ని సింగరేణికి కేటాయించండి : ఎంపీ వంశీకృష్ణ
  • కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి ఎంపీ వంశీ, ఎమ్మెల్యే వివేక్ విజ్ఞప్తి

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణలోని బొగ్గు గనులను వేలం వేయకుండా.. సింగరేణి సంస్థకు కేటాయించాలని పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ, చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం పార్లమెంట్ ప్రాంగణంలో కిషన్ రెడ్డిని వంశీ, వివేక్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో బొగ్గు గనులను సింగరేణికి కేటాయించాలని వినతిపత్రం సమర్పించారు.

తాజాగా రాష్ట్రంలో బొగ్గు గనుల వేలం నిర్వహించగా.. ఒక గని వేలం పూర్తయింది. ఈ నేపథ్యంలో తెలంగాణలోని బొగ్గు గనుల వేలంపై పునరాలోచన చేయాలని వారు కేంద్ర మంత్రిని కోరారు. కాగా, వారి విజ్ఞప్తిని పరిశీలించి.. సరైన నిర్ణయం తీసుకుంటామని ఎంపీ, ఎమ్మెల్యేలకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు.