
రామచంద్రాపురం (పటాన్చెరు), వెలుగు: 2026 లోపు ఆధునాతన పరిజ్ఞానంతో కూడిన బిల్డ్ ఇన్ హెడ్ ట్రాకింగ్ సెన్సార్ ఆడియోలను తీసుకురాబోతున్నట్లు ప్రపంచ ప్రఖ్యాత ఆడియో టెక్నాలజీ మార్గదర్శకుడు, బీబీ ల్యాబ్స్ జీఎంబీహెచ్ సీఈవో కార్ల్ హీన్డ్ బ్రాండెన్ బర్గ్ పేర్కొన్నారు. జర్మనీలోని ఇల్మెనావ్ టెక్నికల్యూనివర్సిటీ సీనియర్ ప్రొఫెసర్ అయిన బ్రాండెన్బర్గ్ పటాన్చెరు పరిధిలోని గీతం వర్సిటీలో మంగళవారం జరిగిన ఆడియో అకౌస్టిక్స్ సిగ్నల్స్ ప్రాసెసింగ్ సెమినార్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బర్గ్ మాట్లాడుతూ .. ఆడియో కోడింగ్ పరిణామం, మ్యూజిక్ ఇన్ఫర్మేషన్ రిట్రీవల్, స్పేషియల్ఆడియో, హెడ్ ఫోన్ లిజనింగ్ టెక్నాలజీలు రాబోయే రోజుల్లో కొత్త పుంతలు తొక్కబోతున్నట్లు వివరించారు. ఎంపీ3 ఫార్మాట్ ఆవిష్కరణ తర్వాత ఓకియానోస్ ప్రో, పీఏఆర్టీవై (పార్టీ) వంటి అత్యాధునిక టెక్నాలజీలపై విస్తృత పరిశోధనలు చేశామని త్వరలోనే క్యూ4 ను తీసుకొస్తామని చెప్పారు.
గీతం ఈఈసీఈ బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మరో అంశంలో న్యూఢిల్లీలోని సెరాఫిమ్ కమ్యూనికేషన్స్ ఫౌండర్, సీఈవో సునందారావు ఎర్డెమ్ జర్మనీలోని వృత్తి పరమైన అవకాశాలపై ప్రసంగించారు. యువ ఇంజినీర్లకు వరల్డ్ కెరీర్ అవకాశాలు, టెక్నాలజీ ఇన్నోవేషన్స్కు జర్మనీ అనువైనదిగా ఆమె సూచించారు. కార్యక్రమంలో గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీ డైరెక్టర్ప్రొఫెసర్ రామశాస్ర్తీ వేదాల, ఈఈసీఈ హెడ్టి. మాధవి, సివిల్ఇంజినీరింగ్ హెడ్ చేపూరి అఖిలేశ్, ప్రొఫెసర్ త్రినాథరావు పాల్గొన్నారు.