పాలేరులో ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం : ఎంపీడీఓ వేణుగోపాల్​రెడ్డి

పాలేరులో ధాన్యం కొనుగొలు కేంద్రం ప్రారంభం : ఎంపీడీఓ వేణుగోపాల్​రెడ్డి

కూసుమంచి,వెలుగు : దళారులను నమ్మి మోసపోవద్దని ఎంపీడీఓ వేణుగోపాల్​రెడ్డి రైతులకు సూచించారు.సోమవారం జిల్లా కలెక్టర్​ ముజామ్మిల్​ఖాన్​ ఆదేశాలతో కూసుమంచి మండలం పాలేరులో ఐకేపీ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎంపీడీఓ వేణుగోపాల్​రెడ్డి, డీటీ కరుణశ్రీ ప్రారంభించారు.

ఈసందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలో మొత్తం 13 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. ఏగ్రేడ్​ ధర రూ,2320, బి గ్రేడ్​ ధర రూ,2300 ధర ఉందని రైతులకు వారి ఎకౌంట్లలో డబ్బు పడతాయన్నారు. ఈకార్యక్రమంలో ఏఈఓ సౌమ్య, ఏపీఓ అప్పారావు, నాయకులు రాంరెడ్డి,బదావత్ నరేశ్​ పాల్గొన్నారు.