ఖైరతాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన ఇందిరమ్మ కమిటీల్లో ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీలకు స్థానం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఎంపీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడీల కుమార్గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ దేవి రవీందర్ప్రభుత్వాన్ని కోరారు.
గురువారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ.. గ్రామ సర్పంచ్, పంచాయితీ ప్రత్యేక అధికారి, గ్రామంలోని కొందరు వ్యక్తుల భాగస్వామ్యంతో ఇందిరమ్మ కమిటీ వేయాలని ప్రభుత్వ ఉత్తర్వుల్లో ఉందని, ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడం కరెక్ట్కాదన్నారు.
కులగణన జరిగినా..లేకున్నా..బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్చేశారు. సమావేశంలో నాయకులు దేవేందర్ గౌడ్, శివ, మోహన్ రెడ్డి, అశోక్కుమార్, రాజు, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.