
- వర్గీకరణలో మాదిగల వాటా న్యాయమైనదే
- ఉద్యమం ఆరంభంలో ఉన్నవారు ఇప్పుడు మందకృష్ణతో లేరు
- గ్రూప్స్ ఎగ్జామ్స్ పేరుతో మాదిగ విద్యార్థులను రెచ్చగొడుతున్నారని ఫైర్
పంజాగుట్ట, వెలుగు: ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేవారిని చెప్పులు, రాళ్లతో కొట్టి సమాధానం చెప్పాలని తెలంగాణ మాదిగ దండోరా వ్యవస్థాపక అధ్యక్షుడు, ఎమ్మార్పీఎస్వ్యవస్థాపక జనరల్సెక్రటరీ దేవని సతీశ్మాదిగ అన్నారు. ఎస్సీ వర్గీకరణను ఎవరు వ్యతిరేకించినా తరిమితరిమి కొడతామన్నారు. మొట్టమొదటి ఎమ్మార్పీఎస్ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో జరిగింది. సతీశ్మాదిగ అధ్యక్షత వహించగా.. తెలంగాణతోపాటు ఆంధ్రప్రాంత ఉద్యమకారులు హాజరయ్యారు. 30 ఏండ్ల పాటు ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో మందకృష్ణతో ఉన్న వారంతా హాజరైనట్టు సతీశ్మాదిగ తెలిపారు.ముందు నుంచి మందకృష్ణతో ఉన్నవారు ఇప్పుడు ఎవరూ అతనితో లేరన్నారు.
వర్గీకరణ చేయాలని కోరిన మందకృష్ణ.. ఇప్పుడు వర్గీకరణ వద్దంటున్నాడని పేర్కొన్నారు. చిన్న పిల్లలను వెంట బెట్టుకుని తిరుగుతున్నారన్నారు. గ్రూప్ -1,2,3,4 పేరుతో విద్యార్థులను రెచ్చ గొడుతున్న నాయకుడి మాటలు నమ్మొద్దని సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీరిజర్వేషన్ ఉప వర్గీకరణ చేస్తూ చట్టం తీసుకొస్తున్నందుకు మొట్టమొదటి ఎమ్మార్పీఎస్ ఉద్యమకారులుకాంగ్రెస్ పార్టీకి, మంత్రి దామోదర రాజనర్సింహకు కృతజ్ఞతలు తెలిపారు.
2024 ఆగస్టు 1న సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పునకు కాంగ్రెస్ప్రభుత్వం కట్టుబడి ఉందని సీఎం రేవంత్రెడ్డి చెబుతూనే.. అవకాశం ఉంటే గతంలో ప్రకటించిన గ్రూప్-1, గ్రూప్ -2, గ్రూప్-3, గ్రూప్-4 ఇతర ఉద్యోగాలలో కూడా ఆర్డినెన్స్తీసుకు వచ్చి వాటిలో కూడా వర్గీకరణ అమలు చేస్తామని ప్రకటించారని సతీశ్మాదిగ గుర్తుచేశారు.