
హైదరాబాద్, వెలుగు: -ఎంఎస్ఎన్ రియాల్టీ తమ ఫ్లాగ్షిప్ ప్రాజెక్ట్ 'వన్ బై ఎంఎస్ఎన్' ను ప్రారంభించినట్లు ప్రకటించింది. కోకాపేటలో నిర్మించబోయే ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ 7.7 ఎకరాల్లో విస్తరించి ఉంది. ఇందులో 55 అంతస్తులు ఉండే ఐదు టవర్లను నిర్మిస్తారు. 5,250 నుంచి 7,460 చదరపు అడుగుల విస్తీర్ణంలో 655 అపార్టుమెంట్లను కడతారు. ఇందుకోసం రూ. 2,750 కోట్లు పెట్టుబడి పెడతారు. ఐదేళ్లలో డెలివరీలు ఇస్తారు.