
భైంసా, వెలుగు : పల్సికర్ రంగారావు ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్తో ప్రతి ఏటా వర్షాకాలంలో ముంపునకు గురై నష్టపోతున్న గుండ్గావ్గ్రామస్తులకు నష్టపరిహారం అందించాలని ముథోల్ఎమ్మెల్యే రామారావు పటేల్ విజ్ఞప్తి చేశారు. శుక్రవారం హైదరాబాద్లోని ఇరిగేషన్, క్యాడ్ ఈఎన్సీని కలిసి విన్నవించారు. గ్రామస్తులు ఏటా వందల ఎకరాల్లో పంటలు నష్టపోతున్నారని, గ్రామంలోకి వరద నీరు వచ్చి చేరి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
వారికి సకాలంలో నష్టపరిహారం విడుదల చేయాలని కోరారు. అదే విధంగా కుంటాల, తానూర్ మండలాల్లోని కాళేశ్వరం 27, 28 ప్యాకేజీల నిర్మాణ పనులను త్వరగా పూర్తిచేసి సాగుకు నీరందించాలన్నారు. ఆయన వెంట సిర్పూర్ ఎమ్మెల్యే హరీశ్బాబు, స్థానిక బీజేపీ లీడర్లు ఉన్నారు.