సుచిత్రలో ‘ముకుంద జ్యువెలరీస్’ ఓపెన్

సుచిత్రలో ‘ముకుంద జ్యువెలరీస్’ ఓపెన్

జీడిమెట్ల, వెలుగు: సిటీలోని సుచిత్రలో ‘ముకుంద జ్యువెలరీస్’ షోరూమ్ ఓపెన్​అయింది. శుక్రవారం కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ముకుంద ఎండీ నర్సింహారెడ్డి, డైరెక్టర్లు నిఖితారెడ్డి, క్రిష్ణతో కలిసి ప్రారంభించారు. షోరూమ్​లోని ఆభరణాలను చూశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వివేకానంద మాట్లాడుతూ.. అతి తక్కువ కాలంలో ప్రజల్లో ఆదరణ పొంది, సుచిత్రలో ముకుంద ఆరో షోరూమ్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు.

కస్టమర్ల నమ్మకాన్ని, అభిమానాన్ని చూరగొని 60 షోరూమ్స్​ఏర్పాటు చేసే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డైరెక్టర్​నిఖితారెడ్డి మాట్లాడుతూ.. మిగతా జ్యువెలరీ షోరూమ్స్, షాప్స్​కు సాధ్యం కాని ఆఫర్లు అందిస్తున్నామని చెప్పారు. తమది ఫ్యాక్టరీ అవుట్ లెట్ అని, మేకింగ్, మజూరీ చార్జీలు లేకుండా ఆభరణాలను అందిస్తున్నామని తెలిపారు. వీఏ, తరుగు 12 శాతం మాత్రమే ఉంటుందన్నారు.

ప్రారంభ ఆఫర్​కింద సుచిత్ర బ్రాంచ్​లో వీఏ, తరుగుపై 20 శాతం డిస్కాంట్​ ఇస్తున్నామని చెప్పారు. ఈ నెల 20 వరకూ ఆఫర్​ఉంటుందని చెప్పారు.