లక్నోలోని 10 హోటళ్లకు బాంబు బెదిరింపులు

లక్నోలోని 10 హోటళ్లకు బాంబు బెదిరింపులు

లక్నో: ఉత్తరప్రదేశ్ లక్నోలోని పలు హోటళ్లకు ఆదివారం బాంబు బెదిరింపులు వచ్చాయి. వాటిని పేల్చేస్తామంటూ దుండగులు ఇమెయిల్ లో హెచ్చరించారు. మారియట్, ఫార్చ్యూన్, లెమన్ ట్రీ, సిల్వెట్టె వంటి 10 హోటళ్లను బెదిరించారు. తమకు రూ.46 లక్షలను చెల్లించాలని దుండగులు డిమాండ్ చేశారు. తమ డిమాండ్ నెరవేర్చకపోతే హోటళ్లను పేల్చేస్తామని తెలిపారు.

‘‘హోటల్ గ్రౌండ్ ఫ్లోర్ లో నల్లటి సంచుల్లో బాంబులను ఉంచాం. మాకు రూ.46 లక్షలు చెల్లించండి. లేని పక్షంలో బాంబులను పేల్చేస్తాం. వాటిని నాశనం చేసేందుకు ప్రయత్నించినా అవి పేలిపోతాయి” అని ఇమెయిల్​లో పేర్కొన్నారు.