ములుగు సెంట్రల్ ట్రైబల్​ వర్సిటీలో .. వచ్చే ఏడాది కొత్త కోర్సులు షురూ : వీసీ వైఎల్​ శ్రీనివాస్​ వెల్లడి

ములుగు సెంట్రల్ ట్రైబల్​ వర్సిటీలో .. వచ్చే ఏడాది కొత్త కోర్సులు షురూ : వీసీ వైఎల్​ శ్రీనివాస్​ వెల్లడి
  • ముందుగా పూర్తిస్థాయి 
  • ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై దృష్టి సారిస్తున్నాం

ములుగు, వెలుగు : సమ్మక్క, సారలమ్మ జాతీయ గిరిజన  విశ్వవిద్యాలయంలో వచ్చే ఏడాది నుంచి విద్యార్థులకు కొత్త కోర్సులను అందుబాటులోకి తీసుకొస్తామని వీసీ వైస్​వైఎల్​ శ్రీనివాస్​పేర్కొన్నారు.  ముందుగా వర్సిటీ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​పై దృష్టి సారించామని తెలిపారు. సెంట్రల్​పబ్లిక్​వర్క్స్​డిపార్ట్​మెంట్ వరంగల్​ప్రతినిధి మనీష్​వర్మ టీమ్ శుక్రవారం వర్సిటీ స్థలాన్ని పరిశీలించింది.

ఏం పనులు చేయాలి, ప్లానింగ్​ ఏంటి, భూమి విస్తీర్ణం వంటి అంశాలపై చర్చించారు. అనంతరం ములుగు మండలం జాకారంలోని వర్సిటీ తాత్కాలిక భవనం వైటీసీలో నోడల్ ఆఫీసర్​వంశీతో కలిసి వీసీ మీడియాకు వివరాలు తెలిపారు. వర్సిటీకి ప్రభుత్వం 287ఎకరాల భూమి కేటాయించిందని, అందులో 50ఎకరాలు అటవీ భూమి ఉందని పేర్కొన్నారు. తొలుత క్యాంపస్​ల్యాండ్​చుట్టూ కాంపౌండ్​వాల్​నిర్మించేందుకు రూ.24కోట్ల ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు.

10 రోజుల్లో టెండర్​వేసి ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. క్యాంపస్ పరిధిలో నల్లరేగడి, కొండ, మొరం మట్టి స్వభావం ఉందని, టోపోగ్రాఫికల్ సర్వే చేయిస్తామని వెల్లడించారు.  ప్రస్తుతం బీఏ హానర్స్​ ఇంగ్లీష్​, ఎకనామిక్స్​ కోర్సులు నడుస్తున్నాయని, వచ్చే అకాడమిక్ నుంచి మెయిన్​క్యాంపస్​లో  బయో టెక్నాలజీ, ఎంబీయే, ఇంజినీరింగ్​ ప్రోగ్రాం వంటి జాబ్​ ఓరియెంటెడ్​కోర్సులను అందుబాటులోకి తెస్తామన్నారు. ములుగు ప్రాంత గిరిజన, ఆదివాసీలతో స్థితిగతులు, కల్చర్, లివింగ్, ఎకానమీ వంటి అంశాలపై రీసెర్చ్​కు ట్రైబల్​స్టడీ సెంటర్ ఏర్పాటు చేస్తామన్నారు.