ములుగు జిల్లాలో రైస్ మిల్లు సీజ్..రూ.2 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి  

ములుగు జిల్లాలో రైస్ మిల్లు సీజ్..రూ.2 కోట్ల విలువైన ధాన్యం పక్కదారి  
  • మిల్లు ఓనర్ పై క్రిమినల్ కేసు నమోదు 
  • సివిల్​ సప్లై డీఎం రాంపతి వెల్లడి 

ములుగు, వెలుగు: రూ. కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించిన మిల్లును ములుగు జిల్లా సివిల్​సప్లై అధికారులు సీజ్​చేశారు. మిల్లులో తనిఖీలు చేసి పెద్దమొత్తంలో ఫ్రాడ్​జరిగినట్లు తేల్చారు. మల్లంపల్లి మండలం రాంచంద్రాపూర్​లోని ఉమా బిన్ని రైస్​మిల్లులో శుక్రవారం డిప్యూటీ తహసీల్దార్లు(సివిల్​సప్లై) నితీశ్, రాంచందర్, ఎంఆర్ఐ రమేశ్​తనిఖీ చేసినట్టు డీఎం రాంపతి తెలిపారు.

 2023–--24 సంవత్సరానికి చెందిన సుమారు 604.628 మెట్రిక్​టన్నుల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వలేదని గుర్తించామని పేర్కొన్నారు.  రూ.2.16 కోట్ల విలువైన ధాన్యాన్ని పక్కదారి పట్టించినట్లు తేల్చినట్టు చెప్పారు. అనంతరం మిల్లును సీజ్​ చేసిన ఓనర్ భూక్యా ఉమాదేవిపై క్రిమినల్​కేసు నమోదు చేసినట్టు తెలిపారు.

కాగా.. సివిల్ సప్లై అధికారులు రెండు రోజుల కిందనే మిల్లులో తనిఖీలు చేపట్టారని స్థానికులు చెబుతుండగా.. శుక్రవారం ప్రెస్​నోట్​రిలీజ్​చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రైస్​మిల్లర్ల అసోసియేషన్​ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టి వెంటనే సీజ్​చేసిన ఆఫీసర్లు మూడు రోజుల తర్వాత వెల్లడించడంతో విమర్శలు వస్తున్నాయి.