
ములుగు, వెలుగు: ములుగులోని సమ్మక్క, సారలమ్మ జాతీయ గిరిజన విశ్వవిద్యాలయం వైస్చాన్సలర్ వైఎల్ శ్రీనివాస్ మంగళవారం ఆంధ్రాలోని సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీని సందర్శించారు. విజయనగరంలోని వర్సిటీ వీసీ కేటీ కట్టిమణిని కలిసి పాలనాపరమైన అంశాలపై చర్చించారు. భవనాలను పరిశీలించారు అమలు చేస్తున్న కోర్సులు, టీచింగ్స్టాఫ్, ఇతర సదుపాయాలపై ఆరా తీశారు.
ములుగులో ఏర్పాటయ్యే వర్సిటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్పై సమీక్షించారు. వర్సిటీ మాస్టర్ ప్లాన్లో భాగంగా ఆంధ్రాలోని ట్రైబల్ వర్సిటీని సందర్శించినట్టు వీసీ శ్రీనివాస్ తెలిపారు. ఆయన వెంట హైదరాబాద్ సెంట్రల్ వర్సిటీ అసిస్టెట్ప్రొఫెసర్, ములుగు ట్రైబల్ వర్సిటీ నోడల్ ఆఫీసర్ వంశీ తదితరులు ఉన్నారు.