ఫ్యాక్ట్​చెక్ యూనిట్​​కు బాంబే హైకోర్టు చెక్​!

ఫ్యాక్ట్​చెక్ యూనిట్​​కు బాంబే హైకోర్టు చెక్​!

ముంబై: ఆన్​లైన్ ​కంటెంట్​లో ఫేక్​న్యూస్​కు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర సర్కారు ఏర్పాటు చేయదలుచుకున్న ఫ్యాక్ట్​చెక్​ యూనిట్​కు చుక్కెదురైంది. ఇందుకోసం చేపట్టిన ఐటీ రూల్స్​ సవరణలు రాజ్యాంగ విరుద్ధమని బాంబే హైకోర్టు వెల్లడించింది. ఫ్యాక్ట్​చెక్​ యూనిట్​ ఏర్పాటు కోసం సవరించిన ఐటీ రూల్స్​ చెల్లుబాటును సవాల్​ చేస్తూ స్టాండప్​కమెడియన్​ ​ కునాల్​ కామ్రా దాఖలు చేసిన పిటిషన్​పై కోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది.

ఫ్యాక్ట్​చెక్ యూనిట్​ ఏర్పాటుకు కేంద్రానికి అధికారం ఇచ్చే ఇన్ఫర్మేషన్​ టెక్నాలజీ సవరణ నిబంధనలు–2023 రాజ్యాంగంలోని ఆర్టికల్​ 14, 19కు విరుద్ధంగా ఉన్నాయని జస్టిస్​ ఏఎస్ ​చందూర్కర్ ​వెల్లడించారు. ‘‘ఇందులోని విషయాలను నేను క్షుణ్నంగా పరిశీలించాను. ఈ రూల్స్​ ఆర్టికల్​ 14 (సమానత్వపు హక్కు), 19 (భావప్రకటన స్వేచ్ఛ హక్కు)ను ఉల్లంఘిస్తున్నాయి” అని వ్యాఖ్యానించారు.