
కామారెడ్డిటౌన్, వెలుగు : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో ఉన్న వైకుంఠధామాన్ని సోమవారం మున్సిపల్ చైర్పర్సన్ గడ్డం ఇందుప్రియ పరిశీలించారు. పెరిగిన పిచ్చి మొక్కలను తొలగించాలని ఆదేశించారు. వాటర్ ప్రాబ్లమ్, లైటింగ్ సమస్యను పరిష్కరిస్తానన్నారు. కమిషనర్ సుజాత, ఏఈ శంకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ రవీందర్, కౌన్సిలర్లు శివకృష్ణమూర్తి, అన్వర్హైమద్, వంశీ తదితరులు ఉన్నారు.