ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని కలిసిన కాంగ్రెస్​ కౌన్సిలర్లు

ఎమ్మెల్యే వివేక్​ వెంకటస్వామిని కలిసిన కాంగ్రెస్​ కౌన్సిలర్లు

కోల్​బెల్ట్​,వెలుగు: చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్​ వివేక్​ వెంకటస్వామిని క్యాతనపల్లి మున్సిపల్​ కాంగ్రెస్​ కౌన్సిలర్లు మంగళవారం రాత్రి గోదావరిఖని ఎన్టీపీసీలో  కలిశారు. క్యాతనపల్లి మున్సిపల్​ చైర్​ పర్సన్​ జంగం కళ, వైస్​ చైర్మన్​ సాగర్​రెడ్డిపై బీఆర్​ఎస్​ కౌన్సిలర్​ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం వీగిపోయిన విషయం తెలిసిందే.  దీంతో  కాంగ్రెస్​ శిబిరం నుంచి చైర్​పర్సన్​, వైస్​ చైర్మన్​, కాంగ్రెస్​ కౌన్సిలర్లు వచ్చి ఎమ్మెల్యే వివేక్‌‌‌‌‌‌‌‌ను కలిశారు.  

ఎమ్మెల్యే మాట్లాడుతూ..  క్యాతనపల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయాలని కౌన్సిలర్లకు సూచించారు.  కౌన్సిలర్లు  పోలం సత్యనారాయణ, రాజు, కొక్కుల స్రవంతి, పుల్లూరి సుధాకర్​, మేకల తిరుమల, కాంగ్రెస్​ లీడర్లు పల్లె రాజు, ఓడ్నాల శ్రీనివాస్​, గోపతి రాజయ్య, నీలం శ్రీనివాస్​గౌడ్​, ఎండి.అబ్దుల్​ అజీజ్​, మహంకాళీ శ్రీనివాస్​,  రాజేశ్​, సత్యనారాయణ, రమేశ్​, మల్లయ్య ఉన్నారు.