![కాపోల్లం 13 శాతం ఉంటే.. 5 శాతం అంటరా?](https://static.v6velugu.com/uploads/2025/02/munnurukapu-atmaguruva-mahadharna-sena-attempts-to-besiege-cm-revanth-reddy-house_p1zJKDqQAa.jpg)
జూబ్లీహిల్స్, వెలుగు: రాష్ట్రంలో మున్నూరు కాపులు 13 శాతం ఉంటే ప్రభుత్వం 5 శాతం మాత్రమే ఉన్నట్టు చూపించిందని మున్నూరుకాపు ఆత్మగౌరవ మహాధర్నా సేన మండిపడింది. మున్నూరుకాపుల హక్కుల సాధన కోసం బుధవారం ఆ సంఘం రాష్ట్ర కన్వీనర్ఉగ్గే శ్రీనివాస్పటేల్ ఆధ్వర్యంలో జూబ్లీహిల్స్లోని సీఎం రేవంత్రెడ్డి ఇంటి ముట్టడికి యత్నించారు. స్థానిక పోలీసులు అడ్డుకుని ఎస్.ఆర్.నగర్, పంజాగుట్ట పోలీస్స్టేషన్లకు తరలించారు.
శ్రీనివాస్పటేల్మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సీఎం ఇంటి ముట్టడికి వస్తున్న మున్నూరు కాపులను అరెస్ట్చేసి 72 పోలీస్స్టేషన్లకు తరలించారన్నారు. మున్నూరు కాపుల కోసం ప్రభుత్వం ఫైనాన్స్కార్పొరేషన్ఏర్పాటు చేసి రూ.5 వేల కోట్ల నిధులు కేటాయించాలని డిమాండ్చేశారు. మున్నూరు కాపులకు మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్చేశారు. ఆయన వెంట రామిని సందీప్,కటికం మహేష్, అమరం శ్యాం, పత్తి అనిల్, మల్లేశ్ఉన్నారు.