
నెట్వర్క్వెలుగు : రంజాన్ సందర్భంగా మసీదులు, ఈద్గాల వద్ద ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ప్రార్థనా స్థలాల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేయగా, భారీ సంఖ్యలో ముస్లింలు చేరుకుని ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఒకరినొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ పండుగ శుభాకాంక్షలు చెప్పుకొన్నారు.
పలుచోట్ల నిర్వహించిన ప్రార్థనల్లో చిన్నారులు ప్రత్యేక దుస్తుల్లో ఆకట్టుకున్నారు. ముస్లింలు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ప్రముఖులు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, పట్టణాల్లోని పలుచోట్ల ట్రాఫిక్ జామ్ కాకుండా అధికారులు చర్యలు చేపట్టారు.