వక్ఫ్ ​సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింల భారీ నిరసన

వక్ఫ్ ​సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింల భారీ నిరసన
  • హైదరాబాద్​లోఎంఎస్​ మక్తా నుంచిఅంబేద్కర్​ విగ్రహం వరకు ర్యాలీ
  • జాతీయ జెండాలు, అంబేద్కర్​ఫొటోలు, ఫ్లకార్డులతో ఆందోళన 
  • పీసీసీ చీఫ్​ మహేశ్​కుమార్​ గౌడ్​, షబ్బీర్​ అలీ మద్దతు

ట్యాంక్ బండ్, వెలుగు: వక్ఫ్ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ముస్లింలు ఆందోళన చేపట్టారు. ఆదివారం హైదరాబాద్​లోని ఎంఎస్​మక్తా నుంచి నెక్లెస్​రోడ్డు, ఇందిరాగాంధీ స్టాచ్యూ, ఐమాక్స్ థియేటర్, మింట్ కాంపౌండ్, సెక్రటేరియట్, ట్యాంక్​బండ్​అంబేద్కర్​విగ్రహం వరకు భారీ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా జాతీయ జెండాలు, అంబేద్కర్​ఫొటోలు, నల్ల జెండాలు,  ఫ్లకార్డులు పట్టుకొని.. వక్ఫ్​సవరణ చట్టాన్ని రద్దు చేయాలని నినదించారు. మరోపక్క ర్యాలీలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

ఈ సందర్భంగా మైనార్టీ నేత ఫాహిం ఖురేషీ మాట్లాడుతూ.. ‘వక్ఫ్ సవరణ చట్టాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ముస్లిం సమాజం ఆమోదించదు. ఇది ముస్లింలపై దాడిగా పరిగణిస్తున్నాం. సీఎం రేవంత్​రెడ్డి కూడా  వక్ఫ్ సవరణ​బిల్లును తీవ్రంగా వ్యతిరేకించారు. కాంగ్రెస్​అధినాయకత్వం కూడా పలు ప్రకటనలు చేసింది’ అని తెలిపారు. ర్యాలీకి మద్దతుగా కాంగ్రెస్​పీసీసీ చీఫ్​మహేశ్​కుమార్​గౌడ్​, కాంగ్రెస్​నేత షబ్బీర్​అలీ  అక్కడికి రాగా, వారికి ముస్లింలు కృతజ్ఞతలు తెలిపారు.