
జనగామ, వెలుగు: ‘జనగామ టికెట్ను ఇంకా తేల్చలే. కేసీఆర్, కేటీఆర్పరిశీలిస్తున్నరు. రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటరు. సీఎం ఏ నిర్ణయం తీసుకున్నా ఆయన డైరెక్షన్లో పనిచేస్తా. ప్రగతిభవన్ లోచర్చల పేరిట జరుగుతున్న ప్రచారం అంతా ఊహాగానమే..’ అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. శనివారం జనగామ జిల్లా తరిగొప్పుల మండలం బొత్తలపర్రె లో దేవాదుల పైపులైన్ పనులకు ఆయన భూమిపూజ చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
బొంతగట్టు నాగారం, బొత్తల పర్రెల మధ్య గండిరామారం రిజర్వాయర్ నుంచి తరిగొప్పుల, దూల్మిట్ట మండలంలోని 16 చెరువులకు గ్రావిటీ కెనాల్ ద్వారా నీరందించేందుకు ఈ కెనాల్నిర్మాణం చేస్తున్నట్లు తెలిపారు. రైతుల సంక్షేమానికి కేసీఆర్ పాటుపడుతున్నారన్నారు. మూడోసారి కేసీఆర్ సీఎం కావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. జనగామ నియోజకవర్గంలోని పరిస్థితులను సీఎం గమనిస్తున్నారన్నారు. త్వరలోనే మంచి నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు పింగిలి జగన్మోహన్ రెడ్డి, తదితర లీడర్లు పాల్గొన్నారు.